ఆ రోజు నుంచే గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రచారం!

by Disha Web Desk 17 |
ఆ రోజు నుంచే గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రచారం!
X

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో సొంత రాష్ట్రంలో ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఆయన గుజరాత్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భావ్ నగర్, సురేంద్రనగర్, వాల్సాద్ ప్రాంతాల్లో జరిగే ర్యాలీలో ప్రసంగించనున్నట్లు పేర్కొన్నాయి.

ఈ ఏడాదిలో ఇప్పటికే పలుమార్లు గుజరాత్‌లో ప్రధాని పర్యటించిన సంగతి తెలిసిందే. తాజాగా మోర్బీ ప్రమాదం తర్వాత ఘటన స్థలంలో పర్యటించి, సహాయక చర్యలపై ఆరా తీశారు. అంతేకాకుండా గాయపడిన వారిని పరామర్శించారు. సుమారుగా 25 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

మోడీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్ల పాటు పనిచేశారు. ముందు నుంచి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని బీజేపీ హైలెట్ చేస్తుంది. తాజాగా రెండు కీలక ప్రాజెక్టులు గుజరాత్‌కు రావడం బీజేపీకి సానుకూల అంశంగా కనిపిస్తోంది.

Next Story

Most Viewed